పెసరపప్పు -- 100 గ్రా
పచ్చిమిర్చి -- 3
అల్లం -- చిన్న ముక్క
వెల్లుల్లి -- 3
జీలకర్ర పొడి -- ఒక టీ స్పూను
ధనియాల పొడి -- ఒక టీ స్పూను
కరివేపాకు -- ఒక రెబ్బ
ఉప్పు -- రుచికి
పసుపు -- 1 చిటికెడు
పోపు సామాగ్రి -- 1 టేబల్ స్పూన్
!! చేసే విధానం!!
ముందుగా పెసర పప్పు ని ఉడికించుకోవాలి
తరువాత ఒక బాణలి తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి
ఇప్పుడు కొద్దిగా ఆవాలు మరియు జీలకర్ర వేసి వేగ నివ్వాలి
అందులో అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు వేసి వేగ నివ్వాలి
తరువాత పచ్చిమిర్చి మరియు కరివేపాకు కుడా వేసి వేగ నివ్వాలి
ఇప్పుడు వుడికించుకొని పెట్టుకున్న పెసర పప్పుని వేసి బాగా కలుపుకోవాలి
తరువాత కొంచెం పసుపు ,జీలకర్ర పొడి,ధనియాల పొడి,మరియు ఉప్పు వేసి ఉడక నివ్వాలి
2మినిట్స్ ఉడకనిచ్చి దిన్చేసుకోవచ్చు కొత్తిమీర వేస్తే మరీ రుచి
ఇది చపాతికి,రోటికి,పరోటాకి,వేడి వేడి అన్నానికి బాగుంటుంది
****************************************
****************************************
!! టమాటో పప్పు !!
!! కావలసినవి !!
కందిపప్పు ------ 2 కప్పులు
మెంతులు ------ 1/2 స్పూన్
టోమాటో ------ 8
చింతపండు జ్యూస్ ------ 1 టేబల్ స్పూన్స్
పచ్చిమిర్చి ------ 6
పోపుగింజలు :- ఆవాలు , మినపప్పు , చనగపప్పు ,
జిలకర్ర , ఎండుకారం 1/2 టేబల్ స్పూన్ , ఇంగువ , ఎండుమిర్చి 2 ,
కరేపాకు , కొత్తిమిర .
!! చేసే విధానం !!
ముందు కందిపప్పులో మెంతులువేసి వుడికించి పెట్టండి.
( పప్పులో మెంతులువేసి వుడికించినచో గుండెజబ్బులులకు
సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయని పెద్దలు చెప్పారు)
ఉడుకిన పప్పులో టోమాటో , పచ్చిమిర్చి , ఉప్పు , పసుపు , కరేపాకు,
చింతపండు గుజ్జు వేసి బాగా వుడక నివ్వండి.
కళాయిలో నూనే వేసి పోపుగింజలు , కారంపొడి , ఇంగువ , వేసి కొత్తిమిర
చల్లి దించేయడమే .
చపాతికీ , నాన్ కీ , అన్నీటికీ బాగుంటుంది.