!! పులుసులు !!
!! చిన్న ఆనియన్ పులుసు !!

చిన్న చిన్న ఆనియన్స్ 1Kg
పచ్చిమిర్చి తగినంత
కరేపాక్ 2రెబ్బలు కాస్త కోత్తమిర
నిమ్మసైజంత చింతపండు ( రసం)
ధనియ 1 స్పూన్
ఉప్పు , పసుపు , బెల్లం .
బియ్యం 1/2 స్పూన్
మెంతులు 6
నూనే తగినంత
తాలింపు గింజలు ఎండు మిర్చి.
చేసే విధానము !!
ముందుగ కడాయిలో కొద్దిగ నూనే వేసి
5 నిముషాలు ఆనియన్ న్ని దోరగా వేయించండి .
అందులోనే చిల్లి కరేపాక్ వేసి వేయించండి .
తరువాత ఉప్పు పసుపు బెల్లం.
చింతపండు పులుసు 2గ్లాసుల నీళ్ళు వేసి
బాగా వుడక నివ్వండి
పక్కన ధనియ మెంతులు బియ్యం
కాస్త వేయించి అవి గ్రైండ్ చేసి
ఆ పొడిని 1 గ్లాస్ నీళ్ళల్లో వుంటలు లేకుండగా కలిపి
ఈ పులుసులో వేయండి కాస్త కోత్తమిర వేసి మాంచిగా
ఎండు మిర్చితో తాలింపు పెడితే.....
దోసకి ఇడ్లీకి చాలా రుచిగా వుంటుంది :)
!! గుమ్మడికాయ పులుసు !!
!! కావలసినవి !!
చిన్న గుమ్మడికాయలో సగం ముక్క
ఆనియన్స్ --- 3
పచ్చిమిర్చి --- 3
ధనియాలు --- 1 1/2 టేబల్ స్పూన్స్
మెంతులు --- 1/2 టీ స్పూన్
చింతపండు --- పెద్ద నిమ్మకాయంత
ఎండుమిర్చి --- 4
నూనె --- 2 టేబల్ స్పూన్స్
ఉప్పు,పసుపు --- రుచికి తగినంత
బెల్లం --- చిన్న నిమ్మసైజంత
పోపుగింజలు --- ఆవాలు,జిలకర్ర,ఎండుమిర్చి.
ఎండుకొబ్బెర --- 1 టేబల్ స్పూన్
బియ్యం పిండి --- 2 టేబల్ స్పూన్స్
కరేపాకు --- 2 రెబ్బలు
కొత్తిమిర --- 1/2 కట్ట
కారం --- 1/2 టేబల్ స్పూన్
!! చేసే విధానం !!
ష్టవ్ పై దట్టమైన కడాయివుంచి అందులో ఒక స్పూన్ నూనె వేసి
పచ్చిమిర్చి,కరేపాకు,ఆనియన్ వేసి వేయించి అందులో
పొట్టు తీసిన గుమ్మడికాయ ముక్కలు వేసి, 2 గ్లాసుల నీళ్ళుపోసి ఉడకబెట్టాలి.
ఎండుమిర్చి,ధనియాలు,మెంతులు,ఎండుకొబ్బర,అన్నీ దోరగా వేయించి గ్రైండ్ చేసి
పులుసులో వేయాలి.పసుపు,బెల్లం,ఉప్పు,కారం కొత్తిమిర వేసి,చింతపండు గొజ్జుతీసి
పులుసులో వేసి బియ్యంపిండిని సగం గ్లాసు నీళ్ళల్లో కలిపి పులుసులో వేసి
(చిక్కగావుంటే ఒక గ్లాసు నీళ్ళుపోసి ) బాగా వుడకనివ్వాలి.
ఆవాలు,జిలకర్ర,ఎండుమిర్చి తో పోపు పెట్టి
వేడి అన్నానికి నెయ్యివేసుకొని తింటే..ఆహా...ఏమి రుచి...
!!! తోటకూర పులుసు !!!
::కావలిసిన పదార్ధాలు::
తోటకూర కట్టలు 2
ఆనియన్ 2
టమోటాలు 2
చింతపండు గుజ్జు 2 స్పూన్స్
కారం-- ఉప్పు--తగినంత..చిటికెడు పసుపు
పచ్చిమిర్చి 3
తిరగమోత గింజలు
(ఆవాలు..జిలకర్ర..ఎండుమిర్చి..అన్నీ ఒక స్పూన్)
::తయారుచేసే విధానం::
ముందు తోటకూరను శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత సన్నాగా తరిగి ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి.
అలాగే పచ్చిమిర్చి,ఉల్లిపాయలు,టమోటాలను కూడా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి.
మూకుడులో తిరగమోత వేసి ముందుగా ఉల్లిపాయ,టమోటా,పచ్చిమిర్చి,
వేసుకుని బాగా వేగిన తర్వాత తరిగిన తోటకూర వేసుకుని చింతపండు గుజ్జు,పసుపు,
ఉప్పు,కారం ,వేసి 3 గ్లాసుల నీరు పోసి ఉడికించాలి.
బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసి దింపేయాలి.
పులుసు మరీ నీళ్ళగా వుంటే ఒక స్పూన్ బియ్యం పిండి నీళ్ళల్లో కలిపి
తోటకూర పులుసులో కలపడమే. పులుసు కాస్త చిక్కపడుతుంది.
కర్నాటిక వాళ్ళు ఇందులోనే పచ్చి కొబ్బెర వేసుకొంటారు
కావాలంటే మీరూ 2 స్పూన్స్ కోరిన పచ్చి కొబ్బెర వేసుకోవచ్చు :)