మరమరాలు ~~ 2 గ్లాసులు
టొమాటోలు~~ 1/2
ఆనియన్ ~~ 1
బంగాళదుంప ~~ 1
సన్న కారప్పూస ~~ 100 గ్రా
చింతపండు చట్నీ~~ 3 టీస్పూన్స్
పుదీనా చట్నీ~~ 2 టీస్పూన్స్
నిమ్మరసం ~~ 2 టీస్పూన్స్
కొత్తిమిర ~~ 1 టేబల్ స్పూన్
కారంపొడి 1 టీస్పూన్
ఉప్పు తగినంత
!! చేసే విధానం !!
ముందుగా ఆనియన్,టొమాటోలు సన్నగా కోసి పెట్టుకోవాలి.
బంగాళదుంపలు ఉడికించి పొడి చేసి పెట్టుకోవాలి.
వెడల్పాటి గిన్నెలో మరమరాలు,తరిగిన ఉల్లిపాయలు,టొమాటోలు,
కొత్తిమిర,చట్నీలు,బంగాళదుంప పొడి నిమ్మరసం,కారం,తగినంత ఉప్పు వేసి బాగా
కలియబెట్టాలి. చివరగా కారప్పూస,కొత్తిమిరతో అలంకరించి వడ్డించాలి.
!! చింతపండు ~~ స్వీట్ ~~ చట్నీ !!

ఖర్జూరం 4
బెల్లం నిమ్మకాయంత
జీలకర్ర పొడి 1 టీస్పూన్
ఖర్జూరాలు విత్తనం తీసి చిన్న చిన్న ముక్కలుచేసి
అన్నీ కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.
!! పుదీనా ~~ గ్రీన్ ~~ చట్నీ !!

కొత్తిమిర 1 కప్పు
పచ్చిమిర్చి 2
ఉప్పు తగినంత
అన్నీ కలిపి గ్రైండ్ చేయడమే
( కావాలంటే నిమ్మ రసం పిండుకోవచ్చు )
!! స్పెషల్ వడ !!
!! కావలసినవి !!
కందిపప్పు (Bengal gram dal) -- 1/2 కప్
మినపప్పు (Tuar dal) -- 1/2 కప్
జీర -- 1/2 టేబల్స్పూన్
డ్రైచిల్లీ -- 6
ఉల్లిపాయలు -- (onions) -- 1/2 కప్
కరేపాక్ 20 ఆకులు
ఉప్పు రుచికి తగినంత
నూనే -- (Oil) -- వేయించేందుకు తగినంత
!! చేసే విధానము !!
ముందు కందిపప్పు,మినపప్పు, రెండు నీళ్ళ ల్లో 6 గంటలు నానబెట్టాలి.
తరువాత నానిన వాటిలో ఎండు మెరపకాయలు,జిలకర్ర,ఉప్పు,
వేసి బరకగా రుబ్బుకోవాలి. (గ్రైండ్ )చేసుకోవాలి.
రుబ్బిన పిండిలో ఉల్లిపాయలు,కరేపాకు సన్నగా తరిగి
అందులో కలిపి రౌడుగా చేతిమీద కాని,ప్లాష్టిక్ షీట్ పై కాని
వడమాదిరిగా తట్టి,నూనేలో deep fry చేయాలి.
వేడి వేడి వడలపై కొబ్బర చెట్ని కాని,టోమాటో సాస్ తో కాని
తింటే చాలా కమ్మగా ఘుమ ఘుమ గా వుంటాయి.
!! స్వీట్ పూరీ !!
(దిన్ని మడత పూరీ అనికూడ అంటారు :)
కావలసినవి !!
మైదాపిండి -- 500 గ్రా
పంచదార -- 250 గ్రా
యాలకులు -- 8
నెయ్యి -- వేయించడానికి సరిపడా
ఫుడ్ కలర్ --- చిటికెడు
!! చేసే విధానం !!
ముందుగా మైదాపిండి లో వంద గ్రాముల నెయ్యి కలిపి
ఆపై నీళ్ళు జ్ళ్ళి ముద్దలా చేయాలి.
మైదా ముద్దను రెండు భాగాలుగా చేసి ఒక దానిలో ఫుడ్కలర్ కలపాలి.
ఈ రెండు రకాల ముద్దల్ని విడి విడిగా చపాతీలా చేయాలి.
ఇప్పుడు మామూలు చపాతిమీద రంగు చపాతి ఉంచి వీటిని చాపలా చుట్టాలి.
ఈ రోల్ను చాకుతో ముక్కలుగా కోసి,ఒక్కో ముక్కను మళ్ళీ పూరీలా ఒత్తి
నేతిలో కరకరలాడేలా వేయించాలి.
పంచదార,యాలకులు కలిపి మెత్తగా పొడిలా చేయాలి.
ఈ పోడిని వేయించిన పూరీలమీద బాగా జల్లాలి...అంతే...స్వీట్ పూరీ తయార్....
!! సగ్గుబియ్యం వడలు !! sabudana vada !! saggu బియ్యం --1 కప్
పోటాటో --(mashed potato)-- 1 కప్
గ్రీన్ చిల్లీస్ -- 4 , 5.
కోత్తమిర 1/2 కట్ట
జిలకర వేయించినది -- 1 టేబల్ స్పూన్
పంచదార -- 1/4
నూనే -- 100 గ్రా
ఉప్పు తగినంత
కరేపాక్ -- 2 రెబ్బలు
!! చేసే విధానం !!
ముందు సగ్గుబియ్యం వాటర్ లో 1 గంట నానబెట్టాలి.
పోటాటో కుక్కర్ లో పెట్టి మెత్తగా చేసుకొని
దాన్ని మెత్తగా పిసికి వుంచికోవాలి.
నానిన సగ్గుబియ్యం,mashed potato ఉప్పు వేసి కలిపి,
అందులో పంచదార,కోత్తమిర,కరేపాకు,చిల్లీ,అన్నీ సన్నగా తరిగి
వేసి జిలకర వేసి ఉప్పు తగినంత వేసి అంతా బాగా కలపండి.
మూకుడు లో నూనె వేసి వేడి చేసి అందులో ఈ మిశ్రమాన్ని వడలుగా
చేసుకొని నూనే లో వేయించాలి Deep fry on medium heat
అంతే.....సగ్గుబియ్యం వడలు తయార్...వేడి వేడి గా
కొబ్బెర చట్ని తో గాని టోమాటో సాస్ తో గాని తింటే మళ్ళి వదలరు :)
( పంచదార వేస్తే గోల్డెన్ కలర్ వస్తుందనీ...రుచిగా వుంటుందని వేయడమే )
!! అరటికాయ చిప్స్ !!
అరటికాయలు పీల్ చేసి చక్రాల్లా తరుగుకొని
ఉప్పు వేసి ఉడికించాలి.
తరువాత మాంచి ఎండలో బాగా ఎండనివ్వాలి.
బాగా ఎండాక నూనెలో వేపుకుని పైన కారం చల్లి తినాలి.
ఇవి నెలా రెండు నెలలు నిల్వ ఉంటాయి.
కూరలేవీ లేనప్పుడు ఇవే ఆధారం.
సాంబారులోకి ,రసంలోకి చాలా బావుంటాయి.
!! మిరపకాయ బజ్జీ !!
!! మిరపకాయ బజ్జీ !!
లావు మిరపకాయలు 250 gm
శనగపిండి 250 gm
ఉప్పు తగినంత
కారం 1 tsp
గరం మసాలా 1 tsp
ధనియాల పొడి 2 tsp
వంట సోడా చిటికెడు
నూనె వేయించడానికి
పుదీనా 1/2 cup
నువ్వులు 1/4 cup
పచ్చిమిర్చి ౩
చింతపండు పులుసు 2 tbsp
మిరపకాయలను నిలువుగా చీల్చి గింజలు తీసేయాలి.
మరిగే నీటిలో కొద్దిసేపు ఉంచి తేసేస్తే కారం తగ్గుతుంది.
నువ్వులు,పచ్చిమిర్చి, పుదీనా కాస్త వేయించి
చింతపండు పులుసు కలిపి మెత్తగ నూరి పెట్టుకుని
మిరపకాయలలో కూరి పక్కన పెట్టుకోవాలి.
శనగపిండిలో తగినంత ఉప్పు,కారం, గరమ్ మసాలా,
ధనియాలపొడి, వంట సోడా వేసి నీళ్ళు కలుపుతూ
గరిటజారుగా ఉండలు లేకుండా కలిపి అర గంట అలా ఉంచాలి.
మళ్ళీ కలిపి కూరి పెట్టుకున్న మిరపకాయలను
ఒక్కొక్కటిగా వేడి నూనెలో ఎర్రగా కాల్చి వేడి వేడిగా
టొమాటో సాస్ కాని ఆవకాయతో కాని తింటే
సూపర్గా ఉంటుంది.
కావాలాంటే మిరపకాయలలో కస్త వాము,చింతపండు
పులుసు,ఉప్పు,కొబ్బరిపొడి కలిపి రుబ్బి
మిరపకాయలలో కూరొచ్చు.. బంగాళదుంప కూర చేసి
అది కూడా మిరపకాయలలో కూరి
బజ్జీలు చేసుకోవచ్చు. అప్పుడు మిరపకాయలు చాలా లావుగా వస్తాయి
!! ఫ్రెంచ్ ఫ్రైస్ !! French fries బంగాళదుంపలు 5
నూనె వేయించడానికి్ తగినంత
బంగాళదుంపలను నిలువుగా సన్నని ముక్కలుగా కోసి చల్లటి నీటిలో
గంట సేపు నానబెట్టాలి. తర్వాత తీసి నీరంతా ఓడ్చి, తడి ఆరేవరకు
ఉంచి వేడి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.
!! కాలిఫ్లవర్ మంచురియా !! !! కావలసినవి !!
కాలిఫ్లవర్ 1
{చిన్న చిన్న పువ్వులుగా కట్ చేసి పెట్టుకోవాలి }
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టేబల్ స్పూన్స్
కారం 2 టేబల్ స్పూన్స్
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
పచ్చిమిర్చి పేస్టు 3 టేబల్ స్పూన్స్
కొత్తిమెర 1/2 కట్ట
రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు
సొయా సాస్ 2 టేబల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ 2 టేబల్ స్పూన్స్
{1 1/2 టేబల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ నీ నీళ్ళలో కలిపి వుంచాలి }
గోధుమ పిండి 1 టెబల్ స్పూన్
బియ్యం పిండి 1/2 చుప్
బేకింగ్ పౌడర్ 1/2 టేబల్ స్పూన్
నిమ్మకాయ జూసు 2 టేబల్ స్పూన్స్
నునె వేయించడానికి
!! తయారు చేసే విధానం !!
ఒక గిన్నెలో గొధుమ పిండి, బియ్యం పిండి, 1/2 టేబల్ స్పూన్ కార్న్ ఫ్లోర్,
బేకింగ్ పౌడర్, ఉప్పు, 1 టేబల్ స్పూన్ సోయా సాస్,
1 టేబల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబల్ స్పూన్ కారం, పసుపు,
1 టేబల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్టు, కొంచెం నీళ్ళు పోసి వేసి అన్ని కలుపుకోవాలి.
ఇప్పుడు కాలిఫ్లవర్ పువ్వులుగా కట్ చేసినవి ఇందులో వేసి కలపాలి.
పాన్ లో నునె నీ వేడి చేసి అందులో ఈ కాలిఫ్లవర్ పువ్వులను వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాన్ లో 3 టేబల్ స్పూన్స్ నునె వేసి అందులొ ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
కొంచెం వేయించాక 1 టేబల్ స్పూన్ అల్లుం వెల్లుల్లి పేస్టు, 2 టేబల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్టు,
1 టేబల్ స్పూన్ కారం వేసి వేయించాలి.
అందులో 1 టేబల్ స్పూన్ సోయా సాస్ వేసి వేయించాలి.
ఇప్పుడు మంటను తగ్గించి దానిలో ముందుగా నీళ్ళలో కలిపి వుంచుకున్న కార్న్ ఫ్లోర్ నీ,
రెడ్ ఫుడ్ కలర్ ని వేసి బాగా కలుపుకోవాలి.
అది అలా కలిపాక కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు కొత్తిమెర వేసి కలపాలి.
అందులో కాలిఫ్లవర్, నిమ్మజూసునీ వేసి కలపాలి.
!! మైసూర్ బొండా !!
!! కావలసినవి !!
మైదా - 2 కప్స్
పుల్లటి పెరుగు-2 కప్స్
బియ్యంపిండి -1/2 కప్
ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్
పచ్హిమీరపకాయలు - 4
సొడా -1/4 టేబల్ స్పూన్
ఉప్పు తగినంత
కొత్తిమెర
!! తయరుచెసే విధానం !!
మైదా , పెరుగు , బియ్యంపిండి , ఉల్లిపాయ ముక్కలు , పచ్హిమిర్చి ముక్కలు , కొత్తిమెర , ఉప్పు , సొడా అన్ని కలిపి వుంచాలి.
కొంచం గట్టిగ కలపాలి. అందులొ ఎమైన తక్కువ అయితే మైదా , పెరుగు , బియ్యంపిండి వేసుకొవచ్హు.
ఒక పాన్ లొ నునే వేసి వేడిచెసి , అందులొ కలిపిన పిండిని బొండాలుగా ఫ్రై చెయ్యాలి.
!! పానీ పూరీ !!
పూరి చేసే ఐటమ్స్ !!!
మైద 1 కప్పు
రవ 1/4 కప్పు
కుక్కింగ్ సోడ 3 చిటికెలు
ఉద్దిపప్పు 2 టెబల్ స్పూన్స్
రుచికి తగినంత ఉప్పు.
పూరి చేసే విధానం !!
ఉద్దిపప్పు దోరగా వేయించి పౌడర్ చేసి వుంచండి .
రవ , మైదా , సోడా , ఉద్దిపొడి , ఉప్పు. అన్నీ చల్లటి నీళ్ళుపోసి గట్టిగా పూరీ పిండిలా కలిపి , తడి ఆరకుండగా తడి గుడ్డవేసి 2 గంటలసేపు నానపెట్టాలి .
తరువాత చిన్న చిన్న పూరీలుగా చేసి నూనెలో వేయించు పెట్టుకొండి .
పానీ చేసే విధానం !!!
చింతపండు రసంలో జిలకర వేయించి పౌడర్ చేసి పానీలో కలపండి .
దానితో పాటు పుదిన , కొతమిర , గ్రీన్ చిల్లీ , అన్నీకలిపి గ్రైండ్ చేసి పానీలో కలపంది .
ఫోటాటో కూర:
కావలసినవి !!!
పొటాటో 1/2 కిలో
సన్నగా తరిగిన 2 ఆనియన్స్
పచ్చ బటాని , కార్న్ , 2 పిడికిళ్ళు .
cheese 2 స్పూన్స్
గరం మసాల పౌడర్ 3స్పూన్స్
కొత్తమిర , ఉప్పు , పసుపు . తగినంత.
కూర చేసే విధానం !!!
పొటాటో కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చాక దింపి చల్లారిన తరువాత పొట్టుతీసి మెత్తగా చెసి వుంచుకోవాలి .
తరువాత పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి దోరగా వేయించి , అందులో గరం మసాల , ఉప్పు , పసుపు , రెడ్ చిల్లీ
పౌడర్ 2 స్పూన్స్ , వేసి పచ్చిబటానీలు , కార్న్ అన్నీ అందులో వేసి బాగా వుడికించి కాస్త బట్టర్ వేసి సన్నటి సెగపై 5 నిముషా అలాగే
వుంచి కోత్తమీర వేసి ష్టావ్ ఆఫ్ చేయండి.
పూరి గిన్నెలా hole చేసి అందులో పొటాటోకూర పెట్టి దానిపైపానీ వేసి , పచ్చి ఆనియన్,వేసి తింటే ........వావ్....యమ రుచి :)
మీకు కావాలంటే సన్నగా తరిగిన ఆనియన్స్ . కుకుంబర్ , కారెట్ , టోమాటో slices చేసి , plate లో decorate చేసి పూరితో
పాటు ఇవీ తింటే మరీ మరీ రుచి .:)
!! ఆలూ పరాఠా !! Alu parota
బంగాళదుంపలు 3
గోధుమపిండి 3 cups
మైదా 1 cup
జీలకర్ర 1 tsp
కారంపొడి 1 tsp
గరంమసాలా 1/2 tsp
కొత్తిమిర 2 tsp
కరివేపాకు 1 tsp
ఉప్ప 1/2 tsp
నూనె 50 ml
పెరుగు 3 tbsp
పసుపు 1/4 tsp
బంగాళదుంపలను మెత్తగా ఉడికించి పొట్టు తీసి పొడి పొడిగా చేసుకోవాలి. గోధుమపిండిలోమైదా,కారంపొడి,జీలకర్ర,గరం మసాలా,
సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమిర,పెరుగు ,
బంగాళదుంప పొడి ,పసుపువేసి బాగా కలియబెట్టి
తగిన నీరు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంట పక్కనపెట్తుకోవాలి.
తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకొని
చపాతీల్లా వత్తి వేడి పెనంపై నూనెతో రెండు వైపులా ఎర్రగా కాలుచుకోవాలి.
ఘుమ ఘుమ లాడే వేడి వేడి పరోటా తయార్ :)
!!! బ్రెడ్ బజ్జీలు !!!
కావలసినవి
బ్రెడ్ 8 స్లైసులు
శనగ పిండి 2 కప్పులు
ఉప్పు తగినంత
కారం పొడి 1 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
వంట సోడా చిటికెడు
గరం మసాల పొడి 1/2tsp
వాము లేదా జీలకర్ర 1/2tsp
నూనె వేయించడానికి
చేసే విధానం
ముందుగా బ్రెడ్ ముక్కలను త్రికోణాలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
వాటిని టోస్టర్లోకాని పెనం పై కాని కాస్త గట్టిపడేటట్టు కాల్చి పెట్టుకోవాలి.
గిన్నెలో శనగపిండి,ఉప్పు,కారం పొడి,అల్లం వెల్లుల్లి ముద్ద, వాము లేదా
జీలకర్ర,గరం మసాలా పొడి,వంట సోడా కలిపి నీళ్ళు పోసి
గరిటజారుగా కలిపి ఓ పది నిమిషాలు ఉంచాలి.
నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ ముక్కను పిండిలో
ముంచి నూనెలో వేసి ఎర్రగావేయించాలి .
వేడి వేడిగా సాస్ కాని ఆవకాయ కాని నంజుకుని తింటె అదిరిపోతుంది.
!! వెజిటబుల్ సమోసా !!
కావలసినవి :
సమోసా తయారి :
మైదా - 1 cup
నెయ్యి - 1/2 cup
బేకింగ్ పౌడర్ - 1/4 tbl spoon
ఉప్పు - తగినంత
నీళ్ళు
కూర తయారికి :
బంగాలదుంపలు - 2( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిపెయ్యాలి).
ఉలిపాయాలు - 1 ( ముక్కలు)
పచ్చి బఠానీలు - 1 cup
పచ్చిమిరపకాయలు - 2
కొత్తిమెర
నిమ్మ జూసు - 2 tbl spoon
పసుపు - 1/2 tbl spoon
గరం మసాల - 1/2 tbl spoon
కారం - 1 tbl spoon
ఆవాలు - 2 tbl spoons
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 tbl spoon
ఉప్పు - తగినంత
నునె - వేయించడానికి
కరివేపాకు - 4
తయారు చేసే విధానం :
మైదా లో ఉప్పు,బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి కలుపుకోవాలి.
కొంచెం నీళ్ళు పోసి చాలా మెత్తగా కలుపుకోవాలి.
కలిపిన పిండి ని 30 నిమషాలు పాటు తడిబట్టతో పెట్టి వుంచాలి.
కూర విధానం :
ఒక పాన్ లో నునె వేసి వేడి చెయ్యాలి.
అందులో ఆవాలు, కరివేపాకు ,వేసి వేయించాలి.
అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
ఇప్పుడు పచ్చిబఠానిలు,అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల,కొత్తిమెర,కారం, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
కొంచెం వేయించాక అందులో బంగాలదుంపను వేసి వేయించాలి.
అందులో నిమ్మ జూసు వేసి కలుపుకోవాలి.
కలిపేసి పెట్టుకున్న మైదా ని మళ్ళీ బాగా కలుపుకోవాలి.
చపాతీ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకునిచపాతీలా చేసి
వాటిని సగానికి కట్ చేసి సగభాగాల మధ్యలో కూర మిశ్రమాన్ని పెట్టి త్రికోణపు ఆకారంలో మడవాలి.
అంచులు గట్టిగ వత్తలి. వాటిని కాగిన నూనెలో ఎర్రగా వేయించాలి.
సమొసా నీ టొమటో సాస్ తో తింటే బాగుంటుంది.
!!!!!! కాబేజి రోల్స్ !!!!!!
!!!! కావలసినవి !!!!
కాబేజి 1/4
మొక్కజొన్నపిండి 10 గ్రాములు
నూనె తగినంత
కారెట్స్ 1/4
బియ్యం పిండి 1/4 కప్
!!!! తయారు చేసే విధానము !!!!
కాబేజీ , కారెట్ లను కొబ్బరిలాగా తురుమాలి . పచ్చిమిర్చిని , ఉప్పు , మొక్కజొన్న పిండిని కలపాలి .దీనిని ముద్దగా చేయాలి చిన్న
చిన్న బాల్స్ లాగా చేయాలి .పాన్ లో నూనె వేసి వేడెక్కిన తరువాత కాబేజీ బాల్స్ ని తగినంతగా వేయించి అంటే దోరగా గోల్డెన్ కలర్ వచ్చెంత
వరకు వేయించీ సాస్ తో గాని చిట్ని తో గాని సర్వ్ చేయాలి :)
!!! ఆలూ చిప్స్ !!!
ఆలూ 1 కిలో ,
నూనె 300 గ్రా
జీరా 1 టీ స్పూన్ ,
ఉప్పు 1 టీ స్పూన్ ,
1 టీ స్పూన్ కారం ,
ఆం చూర్ పోడి 1 టీ స్పూన్ .
!!!!!! చేసే విధానం !!!!!!
ఆలు బాగా కడిగి పొట్టు తీసి పలుచగా ఆలు చిప్$స్ కొట్టే పీటపై కొట్టాలి ఆలు చిప్$స్ ఒక పొడి బట్టపై వేసి, ఆరిన తరువాత , బాండీలో నూనె
వేడి చేసి , బాగా వేడి అయిన తరువాత , ఆరిన చిప్$స్ పచ్చివి బాండిలో కొన్నివేసి వేయించి జల్లిగరిటతో తీసి పేపర్ పై వేయాలి . అలా
అన్ని చిప్$స్ వేయించుకొని తీసి , మళ్ళీ 5 నిముషాల తరువాత నూనె వేడి చేసి చిప్$స్ ఎర్రగా వేయించాలి , అప్పుడు బేసిన్ లో తీసి ,
ఉప్పు , కారం , జీరా , ఆం చూర్ ,పొడి కలిపి తింటే చాలా బాగుంటాయి . రెండుసార్లు వేయించడం వలన చాలా కరకరలాడుతాయి .
చల్లార్చి ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెడితే చాలా రోజులు నిల్వ ఉంటాయి :)
!!! చేగోడీలు !!!
కావలసినవి !!!
బియ్యపు పిండి -
3 గ్లాసులుమైదా -
1 గ్లాసునెయ్యి -
50 గ్రావాము -
1/2 టీస్పూనుపసుపు -
1/4 టీస్పూనుకారంపొడి -
1/2 టీస్పూనుఉప్పు -
తగినంతనూనె -
వేయించడానికి సరిపడినంత
తయారుచేసే విధానం !!!
ముందుగా ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు పెట్టవలెను.దానిలో తగినంత ఉప్పు వేసి ఎసరు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి
దించవలెను.ఇప్పుడు వాము,కారంపొడి,పసుపు వేసి వెంటనే మొత్తం బియ్యపుపిండి,మైదాలను కలిపి దానిపైన నెయ్యి పోసి గిన్నెపై
మూతపెట్టవలెను.
పిండి కొంచెం చల్లారిన తర్వాత పిండి ముద్దను రెండు అరిచేతులతో బాగా నలిపి సన్నగా తాడులా పొడవుగాచేసి కావలసిన సైజులో రింగులుగా
అంటే గుండ్రంగా చేసి వేడినూనెలో ఎర్రగా వేయించి తీసేయవలెను. కరకరలాడే కమ్మని చేగోడీలు తయార్
!!! సేమ్యా బోండా !!!
కావలసినవి !!!!
సేమ్యా 1/4 కేజి ,
క్యాబేజీ 100 కేజి ,
క్యారట్ 50 గ్రాం ,
మంచినూనె 1/4 కేజి ,
నెయ్యి లేదా డాల్డా 50 గ్రాం ,
శనగపిండి 1 కప్పు ,
బియ్యం పిండి 1 కప్పు ,
ఉల్లిపాయలు 1 ,
పచ్చిమిర్చి 4 ,
అల్లం అంగుళం ముక్క ,
కారం 1 టీ స్పూన్ ,
ఉప్పు తగినంత ,
పసుపు 1/2 టీ స్పూన్ ,
వంట సోడా చిటికెడు ,
కరివేపాకు ఒక రెబ్బ ,
ఆవాలు 1/4 టీ స్పూన్ ,
జీలకర్ర 1/4 టీ స్పూ
న్జీడిపప్పు 8 .
చేసే విధానం !!!!
ముందుగా సేమ్యాను నేతిలో కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పుగిన్నెలో 4 స్పూనుల నూనె వేసి వేడి చెసి
ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,వేసి ఆతర్వాత తరిగిపెట్టుకున్న ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవన్నీవేగాక తరిగిన
క్యాబేజీ,తురిమిన క్యారట్, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి.కొద్దిగా మగ్గిన తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు పోసి మరిగించాలి.నీళ్ళు
మరుగుతుండగావేయించిన సేమ్యాను వేసి ఉండలు కట్టకుండా దగ్గరకు వచ్చేవరకు కలుపుతూఉండాలి. దింపేముందు జీడిపప్పు,సన్నగా
తరిగిన కొత్తిమిర వేసి కలపాలి.శనగపిండి,బియ్యంపిండి మిశ్రమంలో తగింత ఉప్పు,కారం పొడి, వంటసోడా నీళ్ళుపోసి బజ్జీల పిండిలా
కలపాలి.పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడి చేయాలి.సేమ్యా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసిపిండిలో ముంచి నూనెలో వేసిఎర్రగా
వచ్చేలా వేయించి తీయాలి. ఇవి వేడి మీద తింటే చాలా బావుంటాయి
!!! బియ్యపు చెక్కలు !!!
బియ్యపు పిండి 1/2 కేజి ,
జీలకర్ర 1/2 స్పూను ,
కారం పొడి 1/2 స్పూను ,
ఉప్పు తగినంత ,
కరివేపాకు 1 రెబ్బ ,
నానబెట్టిన పెసర పప్పు 100 గ్రాం ,
కరిగించిన నెయ్యి లేదాడాల్డ 50 గ్రాం .
ముందుగా పిండిలో ఉప్పు,కారం పొడి,సన్నగా తరిగిన కరివేపాకు జీలకర్ర,కరిగించిననెయ్యి,నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలిపి ఒక గ్లాసు
మరిగించిన నీరు పోసిమొత్తం బాగ కలిపి మూత పెట్టి ఉంచాలి. తర్వాత పిందిని బాగ కలిపి చిన్న చిన్నఉండలుగా చెసుకుని పాలిథిన్ కవరుపై
నూనె రాసి పల్చగా వత్తి వేడి నూనెలోఎర్రగా వేయించి పెట్టుకోవాలి.కావలంటె వేయించిన పల్లీలు కూడ వేసుకోవచ్చు.ఇవి చాల రోజులు నిలవ ఉంటాయి
!!! బ్రెడ్ మంచూరియా !!!

మైదా 1/2 కప్పు ,
కార్న్ ఫ్లోర్ 1 టేబల్ స్పూన్ ,
అల్లం వెల్లుల్లి ముద్ద 2 టీస్పూన్స్ ,
మిరియాల పొడి 1 టీస్ పూన్స్ ,
కారం పొడి 1/2 టీస్ పూన్స్ ,
ఉప్పు తగినంత ,
సోయా సాస్ 1/2 టీ స్పూన్స్ ,
అజినొమొటో చిటికెడు ,
పచ్చిమిర్చి 1 ,
ఉల్లి పొరక 1/4 కప్పు ,
బ్రెడ్ అంచులు తీసేయాలి. ఒక్కో స్లైసును నాలుగు ముక్కలుగా చేసి పెట్టుకోండి.
ఇప్పుడు మైదా,కార్న్ ఫ్లోర్,ఉప్పు,సగం అల్లం వెల్లుల్లి ముద్ద,కారం పొడి కలిపి
కొద్దిగా నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలిపి పెట్టాలి.ఈ మిశ్రమం మరీ చిక్కగా
కాకుండా,మరీ పలుచగా కాకుండా ఉండాలి. పొయ్యి మీద నూనె వేడి చేసి
ఈ బ్రెడ్ ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించాలి. అలా
అన్ని ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి.తర్వాత ఒక బాణలిలో రెండు స్పూనుల
నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లి పొరక,
పచ్చిమిర్చి ముక్కలు, వేసి బాగా వేపాలి. ఇప్పుడు అర కప్పు నీళ్ళలో 1 స్పూను
కార్న్ ఫ్లోర్,అజినొమొటొ,సొయా సాస్,మిరియాల పొడి వేసి కలిపి పోపులో వేసి
మరిగించాలి.ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసి ఓ నిమిషం ఉడికించి దించేయండి.
ఈ వంటకం పొడి పొడిగా కావాలనుకుంటే కారంఫ్లోర్ మిశ్రమం వేయకూడదు.
అజినొమొటొ, సొయాసాస్,మిరియాల పొడి వేసి బాగ వేపి బ్రెడ్ ముక్కలు వేసి
కలిపి ఓ నిమిషం తర్వాత దించితే సరి.
!! బియ్యంపిండి chegodilu !!
!! కావలసినవి !!
బియ్యంపిండి -- 3 (పెద్ద) గ్లాసులు
పెసరపప్పు -- 1/2 కప్పు
ఉప్పు -- రుచికి తగినంత
వాము -- 1 టీ స్పూన్
ఎండు కారం -- 2 టేబల్ స్పూన్స్
నూనె -- వేయించెందుకు తగినంత
ఎందు కొబ్బెరకోరు -- 1 కప్పు
!! చేసే విధానం !!
ష్టవ్ పై దట్టమైన గిన్నె వుంచి అందులో
బియ్యంపిండికి సమపాళ్ళల్లో నీళ్ళుపోసి
బాగా బుడగలు బుడగలుగా తెర్లిన నీళ్ళల్లో
బియ్యంపిండి,పెసరపప్పు,ఉప్పు,వాము,కొబ్బెరకోరు.
వేసి బాగా పిండిని కలయబెట్టి ఉంటలు
రాకుండగా చూసి దించేయాలి.
బాగా చల్లారిన తర్వాత బియ్యంపిండిని
పొడవుగా కడ్డీలుగా చేసి రౌండుగా చుట్టాలి.
మీకు ఎన్ని చుట్లు చుట్టాలనిపిస్తే అన్ని
చుట్టోచ్చు.కొందరు సున్నామాదిరిగా చుట్టి
అతికిస్తారు. మీకు ఏవిధంగ కావాలో చేసుకొని
వాటిని నూనె లో ఎర్రగా వేయించాలి .
కావలసిన వారు 2 పిడికిళ్ళు వేరుశనగలు
పిండి చేసి వేస్తే మరీ రుచి ఎక్కువ మరి మీరు