!! క్యాప్సికం మసాల !!
!! కావలసినవి !!
క్యాప్సికం - 2
ఉల్లిపాయలు - 2
పచ్చిమిరపకాయలు - 5
కారం - 1 tbl spoon
ధనియాలు - 1 tbl spoon
నువ్వులు - 1/4 cup
వేరుశనగుళ్ళు - 1/2 cup
కొబ్బరి - 1/2 cup (పొడి)
ఆవాలు - 1/4 tbl spoon
మెంతులు -చిటికెడు
చింతపండు - నిమ్మకాయంత(నీళ్ళల్లో నానబెట్టాలి)
ఉప్పు -తగినంత
నునె - 3 tbl spoons
కొత్తిమెర
!!! తయారు చేసే విధానం !!!
1.పాన్ లో (నునె లేకుండ)ధనియాలు, వేరుశనగుళ్ళు, నువ్వులు,కొబ్బరి వేసి
వేయించి దానిని మంట మీద నుంచి దింపి చల్లారబెట్టాలి.
2.ఇప్పుడు దానిని గ్రైండ్ చేసుకోవాలి (కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యాలి).
3.పాన్ లో నునె వేసి అందులో ఆవాలు, మెంతులు వేయించాలి.
4.ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
5.అందులో క్యాప్సికం ముక్కలు వేసుకొని వేయించాలి.
6.అది కొంచెం వేయించాక దానిలో గ్రైండ్ చేసి పెట్టుకున్నవేరుశనగుళ్ళుముద్దనీ
వేసి వేయించుకొవాలి.
7.అందులో కారం,ఉప్పు వేసి వేయించాలి.
8.ఇప్పుడు నానబెట్టి వుంచుకున్న చింతపండు పులుసు కొంచెం అందులో వేసి, అది కొంచెం గట్టి పడేవరకు వుంచాలి.
9.అలా కొంచెం గట్టిపడేక మంట మీద నుంచి దింపేముందు కొత్తిమెర వేయ్యాలి.
!!! ఫన్నీర్ మసాల !!!
!! కావలసినవి !!
పన్నీర్ 200 గ్రా ,
ఉల్లిపాయలు 50 గ్రా ,
జిలకర 25 గ్రా ,
ఎండుమెరపకాయలు 4 ,
ధనియాలు పొడి 3 టీ స్పూన్స్ ,
గరం మసాల 5 గ్రా ,అల్లం 25 గ్రా ,
వెల్లుల్లి 20 గ్రా ,
పచ్చిపాలకోవా 50 గ్రా ,
టోమాటో 150 గ్రా ,
రిపైండ్ ఆయిల్ 75 గ్రా ,
కోత్తమిర 1 కట్ట ,
పసుపు చిటికెడ్ద్ .
ఉప్పు తగినంత .
చేసే విధానం !!!
ఒక బాండి లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో 10 గ్రాముల జిలకర , సన్నగ
తరిగిన ఉల్లిపాయలు , అల్లం , వెల్లుల్లి ముల్లలు వేసి వేయించండి . ఇవన్నీ కాస్త వేగిన
తరువాత , పొడవుగా కోసిన పన్నీర్ ముక్కల్ని కూడా వేసి వేయించాలి . ఈ మిశ్రమం అంతా
వేగుతున్నప్పుడే పొడిచేసిన జిలకర్ర , ఎండుమిరపకాయలు , ధనియాలు , గరం మసాల ,
పసుపు , కూడా వేసి రెండు నిముషాలు వేయించి పచ్చికోవాను చేర్చి వుడికించండి . దాంట్లో
సిధంగా వుంచుకొన్న టోమాటోలను రసం పిండి , ఆ తర్వాత వాటిని ముక్కలుగా కోసి ,
ఉడుకుతున్న కూరలో కలిపి , ఉప్పు వేసి , మరో ఐదు నిముషాలు వుడికిన తరువాత బాణలిని
స్టౌ మీదనుంచి దిపండి . కోత్తమీర కలిపిన ఈ కూర చపాతికి పలావ్ కి చాలా బావుంటుంది. :)