!!! రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం ( పరమాన్నం ) !!!
9వ రోజు ప్రసాదం

!! కావలసినవి !!
చిక్కటి పాలు 6 కప్స్ ( 1 టిన్ మిల్క్ మేడ్ ) బియ్యం 1 కప్
శుఘర్ 1,1/2 కప్స్
ద్రాక్షా , జీడిపప్పు 1/4 కప్
ఎలక పౌడర్ 1/2 స్పూన్
గీ 5 టేబల్ స్పూన్స్
!! చేసే విధానం !!
ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త గీ వేసి
అందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి
తరువాత పాలు , ఏలక పౌడర్ , వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు వుంచండి
అది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై వుంచి
అందులో కాస్త గీ వేసి ఈ డ్రై ద్రాక్షా , జీడిపప్పు దోరగా వేయించి వుంచండి .
చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి వుడికిన అన్నానికి చెక్కరవేసి
ఒక్క 5 నిముషాలు మళ్ళీ వుడికించి
( అలా వుడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి )
అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కస్త నెయ్యి వేసి వేడి వేడి గా
ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి !!! మీ రడిగిన వరాలన్నీ ఆ పరమ్మాన్నం మైకంలో ఇచ్చేయటమే :)
!!! !!! మహిషాసుర మర్ధిని !!
8వ రోజు ప్రసాదం

!! కావలసినవి !!
బియ్యం 100 గ్రాం
బెల్లం 150 గ్రాం యాలకులు 5
నెయ్యి 50 గ్రాం
జీడిపప్పు 10
!! చేసే విధానం !!!
ముందుగా బియ్యం కడిగి అరగంట నాననివ్వండి .
తరువాత మెత్తగా వుడికించాలి .
అందులో తరిగిన బెల్లం వేసి
మొత్తం కరిగెంత వరకు వుడికించాలి .
జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,
యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి
దించేయడమే .
తియ్యటి తీపితో ఆ తల్లి శాతించి మీ కోరికలన్నీ తీరుస్తుంది :)
!! దుర్గాష్టమి !!
7th Day
!! కావలసినవి !!
కందిపప్పు 1/2 కప్
బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )
1 వంకాయ
1/4 సొర్రకాయ
1 దోసకాయ
బీన్స్ తగినన్ని
1 పోటాటో
వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు
2 బేబీ కార్న్
1/2 క్యారెట్
2 టోమాటో
తగినంత కరేపాక్
కోత్తమీర
కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప
4 గ్రీన్ చిల్లిస్
నూనె తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు గొజ్జు తగినంత
కాస్త బెల్లం ( జాగిరి )
ఉప్పు , పసుపు తగినంత
3 చెంచాలు సాంబర్ పౌడర్
పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .
!!!! చేయవలసిన విధానము !!!!
ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి
కుక్కర్ లో కందిపప్పు ,బియ్యం ,పీనట్ ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి
పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి .
మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత
పచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి
బాగా వుడికిన తరువత ఆ గ్రేవి అంతా వుడికిన రైస్ లో వేసి,కోత్తమీర ,కరేపాక్ ,నెయ్యి వేసి
మరోసారి వుడికించండి అంతా బాగా వుడికిన తరువాత ,ఎండు మిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి
కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి :)
!! శ్రీ మహాలక్ష్మిదేవి !!
6th Day

!! కావలసినవి !!
రవ 1 కప్
షుఘర్ 3/4 కప్
గీ 2 టెబల్ స్పూన్
కేసరి కలర్ Tel Saffron టెల్ ఒక పించ్
యాలకులు 4
డ్రై ద్రాక్షా 6
జీడిపప్పు 10
మిల్క్ 1 కప్ ( మిల్క్ మేడ్ 1 )
వాటర్ 1/2 కప్
!!! చేసే విధానం !!!
ముందు మూకుడులో కాస్త గీ వేసి రవ దోరగా వేయించి తీసి ప్లేట్ లో వేసి వుంచండి .
అదే మూకుడులో కాస్త గీ వేసి జీడిపప్పు , ద్రాక్ష వేయించి తీసి వుంచండి .
నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా బాయిల్ చేసి అందులో
కేసరి కలర్ ,చెక్కర , రవ ,వేసి వుంటలు రాకుండగా గీ వేస్తూ బాగా కలిపి
అందులో ద్రాక్షా , జీడిపప్పు ,మిగిలిన గీ అంతా వేసి బాగా కలిపి
వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి ఆరగింపు పెట్టి
భోగ భాగ్యాలతో పాటు సౌభాగ్యం కూడా ఇవ్వమని ప్రాథించి నైవేద్యం పెట్టండి
మీ కోరికలన్నీ నెరవేరినట్టే :) ఆ చల్లని తల్లి దీవెనల కన్నా మనకు కావలసినది ఏమి ?
!! సరస్వతి పూజ !!
5th Day
!! పెరుగన్నం , దద్ధోజనం !!
!! కావలసినవి !!
బియ్యం 1/4 కిలో
పాలు 1/2 లీ
చిక్కటి పెరుగు 1/2 లీ
నూనె 1/2 కప్పు
నెయ్యి 1 స్పూన్
కొత్తమిర , కరేపాక్
చిన్న అల్లం ముక్క
పచ్చిమిర్చి
పోపు సామాగ్రి
జీడిపప్పు 20
ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి
!! చేసే విధానం !!
ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక
కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి
సన్నగా తరిగిన చిల్లి , కొత్తమిర ,కోరిన అల్లం ,అన్నీరెడ్డిగ్గా వుంచుకొని
ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసి
ఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపి
కాస్త నేతిలో జీడిపప్పులు వేయించి అవీ వేయండి
రుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ
ఎందుకో తింటే మీకే తెలుస్తుంది ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ :)
!! లలితా దేవి !!
4th Day

!! కావలసినవి !!
మినపప్పు2 కప్స్
అల్లం స్మాల్ పీస్
గ్రీన్ చిల్లీ 6 సన్నగా తరిగి పెట్టండి
జీరా 1/4 స్పూన్
ఉప్పు రుచికి తగినంత
కరేపాక్ , కోత్తమిర తగినంత
నూనె గారెలు వేయించేందుకు
!!! చేసే విధానం !!!
మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు (hours) నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ) .
నానిన మినపప్పును గ్రైండర్లో వేసి అందులోనే అల్లం . గ్రీన్ చిల్లి , ఉప్పు , కాస్త సోడ , వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో
కరేపాక్ , కోత్తమిర , సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌడుగా అదిమి నూనెలో విడచాలి .
దోరగా వేగిన వడలను , సహస్రనామాలతో ఆ లలితాదేవిని ఆరాధించి నైవేద్యం పెట్టి చల్లగా కాపాడు తల్లీ అని వేడుకొని మనం
ఆరగించటమే :)!!!!!
!! అన్నపూర్ణా దేవి !!
3rd Day

!! కావలసినవి !!
బియ్యం 1/2 కిలో
తురిమిన పచ్చికొబ్బెర 1 కప్
పచ్చిమిర్చి 5
కరేపాక్ , కోత్తమిర , ఉప్పు .
పోపు సామాగ్రి ఎండుమిర్చి , ఇంగువ .
జీడి పప్పు 10
నూనె , 1/4 కప్
నెయ్యి 1 టెబల్ స్పూన్
!! చేయవలసిన పద్ధతి !!
అన్నం పోడి పోడి గా వండుకొని
పచ్చికొబ్బెర కాస్త నేతిలో వేయించి
ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలిపండి .
అదే మూకుడులో నూనె వేసి పోపుసామాగ్ర వేసి
ఎండుమిర్చి , ఇంగువ , వేసి
ఆవాలు చిటపట చిటపట అనగానే
పొడవుగా తరిగిన గ్రీన్ చిల్లీ , కరేపాక్ , కోత్తమిర ,
అందులో వేసి తీసేయండి ఈ వేగనిచ్చినదంతా అన్నంలో కలిపి
ఉప్పు జీడిపప్పుకూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం రెడి .
కడుపునింపే అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి
మన కడుపు చల్లగా చూడమని వేడుకొనటమే మనం చేయవలసిన పని
కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత తెలిసినదే కదా )
ఆ తల్లి దీవెనలు వుంటే అడివిలో నైనా పిడికెడు అన్నం దొరక్కపోదు :)
!! గాయత్రి దేవి !!
2nd Day

!! కావలసినవి !!
బియ్యం 150 గాం
చింతపండు 50 గ్రాం
పసుపు1/2 స్పూన్
ఎండుమిర్చి 5
ఆవాలు 1/2 స్పూన్
మినపప్పు 1 స్పూన్
శనగ పప్పు 2 స్పూన్
వేరు శనగ పప్పు 1/2 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
నూనె 1/4 కప్పు
ఉప్పు తగినంత
బెల్లం కొద్దిగా
!! చేయవలసిన విధానం !!
అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి .
చింతపండును అరకప్పు నీళ్ళు పోసి
నాన పెట్టి ,చిక్కటి గొజ్జు తీసి పెట్టండి,
మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గొజ్జు వేసి
కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి ( కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చు గొజ్జిలో )
వుడికిన గొజ్జు అన్నంలో కలిపండి .
బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి , వేసి ఆ వాలు చిటపట అన్న తరువాత
వేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరేపాక్ వేసి , అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే జగదేక మాతైన ఆ గాయిత్రి దేవికి
నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము
!! శ్రీ బాలత్రిపురసుందరిదేవి !!
1st Day
!! పొంగల్ !!
!! కావలసినవి !!
పెసరపప్పు 150 గ్రాం
కొత్త బియ్యం 100 గ్రాం
బ్లాక్ పెప్పర్ 15
గ్రీన్ చిల్లి 6
పచ్చి కొబ్బెర 1 కప్
కాచిన నెయ్యి 1/4 కప్
జీడిపప్పు cashewnuts 15
జీర 1/2 టేబల్ స్పూన్
ఆవాలు 1/4 టేబల్ స్పూన్
ఎండుమిర్చి 3
మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్
కోత్తమిర , కరేపాకు , తగినంత
ఉప్పు రుచిని బట్టి
ఇంగువ 2 pinches
!! చేయవలసిన విధానము !!
దళసరి wokలో కాస్త నేయి వేడి చేసి
పెసరపప్పుని దోరగా ఏయించండి .
బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన
తరువాత బియ్యంకూడా బాగా వేయించండి
తెలుపు రంగు పోకూడదు సుమా 5 minutes
వేపితే చాలు పెసరపప్పుకూడ కలర్ మారకూడదు
అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి
జీడిపప్పులను వేయించి పెట్టడి.
సన్నగా తరిగిన చిల్లి ,
పచ్చికొబ్బెర కోరు
పెప్పర్ , జిలకర వేయించిన బియ్యం
పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో
కుక్కర్లో వుంచి 3 whistlesవచ్చాక
ష్టవ్ off చేయండి.
చల్లారాక అందులో ఆవాలు , మినపప్పు ,
శనగపప్పు , జిలకర్ర , ఎండుమిర్చి ,
ఇంగువ, కరేపాక్ వేసి తాలింపు పెట్టి
మిగిలిన నేయ్యి అంతా పొంగలిలో వేసి
వేడి వేడి ప్రసాదము ఆతల్లి త్రిపురసుందరీదేవికి నైవేద్యంపెట్టి
భక్తిగా పూజించి
దసరా 10 రోజులు మాకు శక్తి
నిచ్చి మాచే పూజలందుకొనుమా
మా కోరికలు తీర్చుమా
అని ప్రాథించాలి :)